కరోనా సమయంలో దాతలు సహాయం అందించాలి

ABN , First Publish Date - 2021-05-18T03:37:15+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి దాతలు విరివిరిగా సహకారం అందించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అందించిన మూడు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను స్వీకరించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. కరోనా చికిత్సలో అత్యవసరమైన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను దాతలు అందించడం హర్షనీయమన్నారు.

కరోనా సమయంలో దాతలు సహాయం అందించాలి
ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ను కలెక్టర్‌కు అందజేస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

ఏసీసీ, మే 17 : కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి దాతలు విరివిరిగా సహకారం అందించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అందించిన మూడు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను స్వీకరించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. కరోనా చికిత్సలో అత్యవసరమైన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను దాతలు అందించడం హర్షనీయమన్నారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అవసరమని కోరిన వెంటనే ఆమెజాన్‌ సంస్థ 10 లీటర్ల సామర్ధ్యం గల మూడు కాన్సం ట్రేటర్లను జిల్లాకు అందించారన్నారు.  

నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ వారు స్పందించి  జిల్లాకు  కాన్సంట్రేటర్లను గ్రూప్‌ లీడర్‌ శ్రవణ్‌ ద్వారా అందించారన్నారు. వీటిని బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రానికి అందిస్తామన్నారు.  ఎమ్మెల్యే తోపాటు చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాద సత్యం, సింగిల్‌ విండో చైర్మన్‌ సందెల వెంకటేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T03:37:15+05:30 IST