దేవాలయం పునఃనిర్మాణానికి రూ.లక్ష విరాళం

ABN , First Publish Date - 2022-01-17T04:33:36+05:30 IST

ఆంజనేయస్వామి దేవాలయ పునఃనిర్మాణం కోసం మండల టీడీపీ అధ్యక్షుడు ఎంజర్ల నారాయణరెడ్డి లక్ష రూపాయలు విరాళమిచ్చారు.

దేవాలయం పునఃనిర్మాణానికి రూ.లక్ష విరాళం

పెనగలూరు, జనవరి 16: ఆంజనేయస్వామి దేవాలయ పునఃనిర్మాణం కోసం మండల టీడీపీ అధ్యక్షుడు ఎంజర్ల నారాయణరెడ్డి లక్ష రూపాయలు విరాళమిచ్చారు. సాతుపల్లె దళితవాడలో ఆంజనేయస్వామి దేవాలయం శిధిలావస్థకు చేరుకుంది. దీంతో పెద్దల పండుగను పురస్కరించుకుని తమ తల్లిదండ్రులు లక్షుమ్మ, నరసింహారెడ్డి జ్ఞాపకార్థం నారాయణరెడ్డి విరాళం ప్రకటించారు.

గొబ్బెమ్మ ఉత్సవ నిర్వహణ కోసం మరో రూ. 30వేలను ఇచ్చారు. ఇదిలా ఉండగా దేవాలయ నిర్మాణానికి మరో లక్ష రూపాయలు రానున్న రోజుల్లో అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమం లో ఆదర్శ పాఠశాల మాజీ పీఎంసీ చైర్మన్‌ సి.వెంకటేష్‌, బి.వెంకటయ్య, సి.నరసింహులు, ఎన్‌.చిన్నయ్య, బద్దల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-17T04:33:36+05:30 IST