రామమందిర నిర్మాణానికి విరాళం
ABN , First Publish Date - 2021-01-16T05:14:07+05:30 IST
అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు పుత్తా లక్ష్మిరెడ్డి కుటుంబం రూ.5 వేలు నదును శుక్రవారం అందజేశారు.
ప్రొద్దుటూరు రూరల్, జనవరి 15: అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు పుత్తా లక్ష్మిరెడ్డి కుటుంబం రూ.5 వేలు నదును శుక్రవారం అందజేశారు. స్థానిక ఆలయంలో శ్రీరాముని కి పూజలు చేసి నగదును అందజేశారు. కార్యక్రమంలో పుత్తా లక్ష్మిదేవి, పుత్తా విష్ణువర్ధన్రెడ్డి, పత్తా గోవర్ధన్రెడ్డి, వెంకటలక్షుమ్మ, తదితరులు పాల్గొన్నారు.
సుంకేసులలో ...
సింహాద్రిపురం, జనవరి 15: సుంకేసులలో శుక్రవారం మండల నిధి ప్రముఖ్ లక్ష్మినారాయణరెడ్డి, గ్రామ పం చాయతీ ప్రముఖ్ అమరనాథ్రెడ్డి, బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్ళి రామ మందిర నిర్మాణ నిధి సేకరించారు. రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం వుండాలని ప్రజలకు వివరించారు.
వేంపల్లెలో..
వేంపల్లె, జనవరి 15: ముతుకూరులోని అయోధ్య రామ మందిర అభివృద్ధికి ముతుకూరు గ్రామస్థులు చేయిచే యి కలిపి విరాళం అందించారు. గ్రామస్థులంతా కలిసి రూ. 25,450లను ఆలయ నిర్వాహకులకు అందిం చారు.