చేసిందంతా చేసి.. జాగ్రత్తలు చెబుతున్నారా...?

ABN , First Publish Date - 2020-07-16T12:08:03+05:30 IST

వైసీపీ నాయకులు చేసిందంతా చేసి కరోనా పై ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రైల్వేకోడూరు

చేసిందంతా చేసి.. జాగ్రత్తలు చెబుతున్నారా...?

టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్‌


రైల్వేకోడూరు, జూలై 15: వైసీపీ నాయకులు చేసిందంతా చేసి కరోనా పై ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రైల్వేకోడూరు టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్‌ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు లాక్‌ డౌన్‌ నాటి నుంచి మూడు నెలలుగా కరోనా వైరస్‌ బారిన ప్రజలు పడలేదని, వారు అప్రమత్తంగా లేకనే కరోనా వైరస్‌ రైల్వేకోడూరులో వచ్చిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మూడు నెలల పాటు రోడ్ల పై తిరిగి కరోనా తెచ్చిపెట్టారని తెలిపారు.


అతి చిన్న కార్యక్రమాన్ని కూడా పెద్దగా చేశారని ఆరోపించారు. పుట్టిన రోజు కార్యక్రమాలు, పర్యటనలు తదితర వాటిని రోడ్లపై విచ్చలవిడిగా భౌతికదూరాన్ని పాటించకుండా చేశారని విమర్శించారు. వైసీపీ నాయకులు చేసిన హడావిడి కార్యక్రమాలను జిల్లా అధికారులకు పంపామని తెలిపారు. అధికారులు వైసీపీ నాయకులను కట్టడి చేసి ఉంటే ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉండేది కాదన్నారు.

Updated Date - 2020-07-16T12:08:03+05:30 IST