యజమానిపై శునకం ప్రేమ
ABN , First Publish Date - 2021-12-20T16:16:40+05:30 IST
ఎక్కడో అటవీ ప్రాంతంలో వదిలేసిన ఓ శునకం 80 కిలోమీటర్లు నడిచి తన యజమాని ఇంటికి వచ్చి చేరింది. ఈ ఆశ్చర్యకర సంఘటన అరియలూరు జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే జిల్లాలోని
- 80 కిమీ నడుచుకుంటూ ఇంటికి చేరిన వైనం
అడయార్(చెన్నై): ఎక్కడో అటవీ ప్రాంతంలో వదిలేసిన ఓ శునకం 80 కిలోమీటర్లు నడిచి తన యజమాని ఇంటికి వచ్చి చేరింది. ఈ ఆశ్చర్యకర సంఘటన అరియలూరు జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే జిల్లాలోని తామరైకులం గ్రామానికి చెందిన రాజగోపాల్ అనే వ్యక్తి ఐదేళ్ళుగా ఒక శునకాన్ని పెంచుతున్నారు. అయితే, రెండు రోజుల క్రితం ఆ గ్రామంలోని వీధి కుక్కలను పట్టుకెళ్ళారు. ఈ విషయం తెలిసిన రాజగోపాల్, మరికొందరు గ్రామస్థులతో కలిసి లారీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అది సాధ్యపడలేదు. అయితే, ఈ శునకాలను గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి వదిలేశారు. కానీ, ఈ కుక్క మాత్రం రెండు రోజుల తర్వాత ఇంటి యజమానిని వెతుక్కుంటూ వచ్చి చేరింది. ఈ శునకాన్ని చూడగానే ఆ ఇండి యజమాని పట్టరాని సంతోషంలో మునిగిపోయారు.