ప్రముఖ కంటి వైద్యుడు పీఎల్‌ రావు కన్నుమూత

ABN , First Publish Date - 2021-07-28T05:29:58+05:30 IST

నెల్లూరుకు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు, మోడరన్‌ ఐ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ పీఎల్‌ రావు కన్నుమూశారు.

ప్రముఖ కంటి వైద్యుడు పీఎల్‌ రావు కన్నుమూత
డాక్టర్‌ పీఎల్‌ రావు

నెల్లూరు(వైద్యం), జూలై 27 : నెల్లూరుకు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు, మోడరన్‌ ఐ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ పీఎల్‌ రావు కన్నుమూశారు. సోమవారం అర్ధరాత్రి గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు తెలిసింది. మూడు దశాబ్దాలుగా జిల్లా వాసులకే కాకుండా పలు జిల్లాల ప్రజలకు డాక్టర్‌ పీఎల్‌ రావు కంటి వైద్యసేవలు అందించారు. అలాగే ఐ బ్యాంక్‌ను  ఏర్పాటు చేసి ఎంతో మంది అంధులకు కంటి చూపును ప్రసాదించారు. నేత్ర దాన ఉద్యమంలో చురుకుగా పాల్గొని, జిల్లా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేశారు. ఆయన మృతికి పలువురు వైద్యులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. పీఎల్‌ రావు అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి.

Updated Date - 2021-07-28T05:29:58+05:30 IST