సీరియల్లో ఆ సీన్ చూస్తే నవ్వాపుకోలేరు.. ఆమాత్రం తెలియదా అంటూ నెటిజన్ల ట్రోలింగ్..!
ABN , First Publish Date - 2022-06-06T21:57:31+05:30 IST
సాథ్ నిభానా సాథియా.. ఈ హిందీ ఫ్యామిలీ డ్రామా సీరియల్ ఎన్నో ఏళ్లుగా బుల్లితెర అభిమానులను అలరిస్తోంది.
సాథ్ నిభానా సాథియా.. ఈ హిందీ ఫ్యామిలీ డ్రామా సీరియల్ ఎన్నో ఏళ్లుగా బుల్లితెర అభిమానులను అలరిస్తోంది. ఈ సీరియల్లోని కంటెంట్ గురించి తరచుగా విమర్శలు వినిపిస్తుంటాయి. అర్థం లేని సీన్లతో ఈ సీరియల్ తరచుగా విమర్శల పాలవుతుంటుంది. ఈ సీరియల్లోని ఓ సీన్ను తాజాగా ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ సీన్ ప్రకారం.. సీరియల్లోని గోపి కుటుంబానికి చెందిన ఒక మహిళ స్పృహ తప్పి పడిపోతుంది.
ఆమెను చెక్ చేయడానికి ఒక మహిళా డాక్టర్ వస్తుంది. బీపీ మిషన్ను పేషెంట్ చేతికి తగిలించి, రీడింగ్ చూస్తుంది. అనంతరం పేషెంట్ షుగర్ లెవెల్స్ పడిపోయాయని, అందుకే ఆమె స్పృహ తప్పి పడిపోయిందని చెబుతుంది. ఆ సీన్ను డాక్టర్ గిల్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేసి.. `బీపీ మెషిన్తో షుగర్ కూడా చెక్ చేయవచ్చా` అని కామెంట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంతో మంది ఈ సీన్ను విమర్శిస్తూ మీమ్స్ రూపొందించి పోస్ట్లు చేస్తున్నారు.