పాఠశాలల విలీనం వద్దు
ABN , First Publish Date - 2022-06-30T05:48:58+05:30 IST
పాఠశాలల విలీనం వద్దు
ముదినేపల్లి, జూన్ 29: ప్రభుత్వ పాఠశాలల విలీనంతో గామీణ పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బంది పడతారని, వారికి ప్రాథమిక విద్య దూరమవుతోందని ఏపీటీఎఫ్ నాయ కులు ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాలల విలీనం వద్దంటూ బుధవారం ముదినేపల్లిలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు వారు వినతిపత్రం అందజేశారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తగరగతులను హైస్కూళ్లలో కలపాలన్న నిర్ణయం అసంబద్ధమైదని, కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానంలో విలీనం ప్రస్తావనే లేదని ఎమ్మెల్యేతో చెప్పారు. విలీనం ప్రక్రియను నిలిపి వేయించాలని, ఉపాధ్యాయుల రేషనలైజేషన్ వల్ల గ్రామాల్లో చాలా ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారుతాయని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి బేతాళ రాజేంద్రప్రసాద్, ముదినేపల్లి మండల అధ్య క్షుడు ఎ.హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి బి.జాన్సన్బాబు, జయ శ్రీలత, ఆర్.శ్రీహరి పాల్గొన్నారు.