బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దు

ABN , First Publish Date - 2021-02-26T03:57:47+05:30 IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మీద దుర్మార్గపు ఆలోచనకు పూనుకున్న బీజేపీ సింగ రేణిపై కూడా పావులు కదపాలని కుట్ర పన్నుతోం దని, కార్మికులు, ప్రజలు కంట కనిపెడుతూ ఉండా లని ప్రభుత్వ విప్‌, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్‌ అన్నారు. జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం ఎమ్మెల్యే దివాకర్‌రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుడూరి ప్రవీణ్‌తో కలిసి పరి శీలించారు.

బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దు
నస్పూర్‌లో కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతున్న సుమన్‌

నస్పూర్‌, ఫిబ్రవరి 25: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మీద దుర్మార్గపు ఆలోచనకు పూనుకున్న బీజేపీ సింగ రేణిపై కూడా పావులు కదపాలని కుట్ర పన్నుతోం దని, కార్మికులు, ప్రజలు కంట కనిపెడుతూ ఉండా లని ప్రభుత్వ విప్‌, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్‌ అన్నారు.  జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం ఎమ్మెల్యే దివాకర్‌రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుడూరి ప్రవీణ్‌తో కలిసి పరి శీలించారు. సుమన్‌ మాట్లాడుతూ బీజేపీ నాయ కులు గుడిని, గుడిలోని లింగాన్ని సైతం మింగే విధంగా దిగజారి పోయారని విమర్శించారు. సిం గరేణి కార్మికులు బీజేపీ నాయకులను కంట కని పెడుతూ ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నంత వరకు వారి ఆటలు సాగవన్నారు. జిల్లా పార్టీ కార్యాలయాన్ని త్వరలో కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుంద న్నారు. ప్రస్తుతం సభ్వత్య కార్యక్రమం కొనసాగు తుందని, త్వరలో కమిటీలు, శిక్షణ తరగతుల నిర్వహణకు పార్టీ భవన్‌ ఉపయోగపడుతుం దన్నారు.  టీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ తిరుగులేని రాజ కీయ శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నా రన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేశ్‌, మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, టీబీజీకే ఎస్‌ నాయకులు కుమారస్వామి, ఏనుగు రవిందర్‌ రెడ్డి, విజిత్‌రావు, కమాలాకర్‌రావు, పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-26T03:57:47+05:30 IST