డీఎంకే మేనిఫెస్టో తయారీకి 8 మందితో కమిటీ
ABN , First Publish Date - 2020-10-12T14:25:41+05:30 IST
రాష్ట్రంలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టో తయారీకి ఎనిమిది మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు...
చెన్నై : రాష్ట్రంలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టో తయారీకి ఎనిమిది మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ తెలిపారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వ పదవీకాలం 2021 మే నెలతో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికలు ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డీఎంకే మేనిఫెస్టో రూపకల్పనకు 8 మందితో కూడిన కమిటీని నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఆదివారం వెలువరించిన ప్రకటనలో... మేనిఫెస్టో కమిటీలో పార్టీ కోశాధికారి టీఆర్ బాలు, ఉప ప్రధాన కార్యదర్శులు సుబ్బలక్ష్మి జగదీశన్, ఎ.రాజా, అందియూర్ సెల్వరాజ్, ఎంపీలు కనిమొళి, తిరుచ్చి శివ, టీకేఎస్ ఇళంగోవన్, ప్రొఫెసర్ రామస్వామి తదితరులున్నారు.