అన్ని రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులు
ABN , First Publish Date - 2021-04-22T06:19:49+05:30 IST
దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇతరులకు ఏ మాత్రం తీసిపోరని జిల్లా దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అబ్దుల్ రసూల్ పేర్కొన్నారు.
గార్లదిన్నె, ఏప్రిల్ 21: దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇతరులకు ఏ మాత్రం తీసిపోరని జిల్లా దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అబ్దుల్ రసూల్ పేర్కొన్నారు. మండల పరిధిలోని కల్లూరు ఆర్డీటీ కార్యాలయంలో బుధవారం ఆ సంస్థ ఆధ్వ ర్యంలో జాతీయ మానసిక దివ్యాంగుల సంస్థ (నీప్డ్) సిక్రిందాబాద్ వారు దివ్యాంగులకు బోధనోపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏడీ అబ్దుల్ రసూల్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. నీప్డ్ ప్రతినిధి డాక్టర్ పద్మావతి 24 మందికి దివ్యాంగ పిల్లలకు బోధనోప కరణాలు పంపిణీ చేశారు. మూడు రోజుల నుంచి 169 మంది పిల్లలకు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ దివ్యాంగుల శాఖ డైరెక్టర్ దశరథరాముడు, ఏటీఎల్ రాధ తదితరులు పాల్గొన్నారు.