దివీస్ ఉద్యోగి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-09-16T08:55:46+05:30 IST
దివీస్ కర్మాగారంలో పనిచేస్తున్న యూపీ వెంకటేశ్ (27) అనే యువకుడు బుధవారం భీమిలిలో స్నేహితుని రూమ్లో ఫ్యాన్కు ఉరి వే
భీమునిపట్నం, సెప్టెంబరు 15: దివీస్ కర్మాగారంలో పనిచేస్తున్న యూపీ వెంకటేశ్ (27) అనే యువకుడు బుధవారం భీమిలిలో స్నేహితుని రూమ్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా కంచిక మండలం పరిటాల గ్రామానికి చెందిన వెంకటేశ్ చిప్పాడ వద్ద దివీస్ క్వార్టర్స్లో బ్యాచిలర్ రూమ్లో నివాసం ఉంటున్నాడు.
కాగా భీమిలిలోని సుభాష్ రోడ్డులో తనతో పాటు పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్న సతీశ్ రూమ్కు బుధవారం ఉదయం వచ్చి తాను సెలవు పెట్టానని, సాయంత్రం వరకు ఇక్కడే ఉంటానని చెప్పాడు. దీంతో సతీశ్ డ్యూటీకి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి ఎంత పిలిచినా వెంకటేశ్ రూమ్ తలుపులు తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు.
ఎస్ఐ రాంబాబు సిబ్బందితో వచ్చి తలుపులు తెరిచేసరికి ఫ్యాన్కు వేలాడుతూ వెంకటేశ్ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వెంకటేశ్ తన తమ్ముడికి ఫోన్ చేసి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పాడని మృతుని బావ పోలీసులకు తెలిపారు.