నాటు పడవపై తరలించి నిత్యావసర సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2022-08-13T04:08:59+05:30 IST

బెజ్జూరు మండలంలోని వరద ముంపు ప్రాంతాలైన సుస్మీర్‌, గెర్రెగూడ, మొగవెల్లి, సోమిని, పాత సోమిని, తలాయి, భీమారం, తిక్కపెల్లి గ్రామాలకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో పంపించిన నిత్యావసర సరుకులను టీఆర్‌ఎస్‌ నాయకులు పడవపై తరలించి అందజేశారు.

నాటు పడవపై తరలించి నిత్యావసర సరుకుల పంపిణీ
ముంపు ప్రాంతాలకు నాటు పడవలో సరుకులు తరలిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

బెజ్జూరు, ఆగస్టు 12: బెజ్జూరు మండలంలోని వరద ముంపు ప్రాంతాలైన సుస్మీర్‌, గెర్రెగూడ, మొగవెల్లి, సోమిని, పాత సోమిని, తలాయి, భీమారం, తిక్కపెల్లి గ్రామాలకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో పంపించిన నిత్యావసర సరుకులను టీఆర్‌ఎస్‌ నాయకులు  పడవపై తరలించి అందజేశారు. ప్రాణహిత నది వరదకు జలదిగ్భందంలో ఉన్న తలాయి, భీమారం, తిక్కపల్లి గ్రామాలకు పడవ ద్వారా తరలించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు సకారాం, వెంకన్న, నరేందర్‌గౌడ్‌, ఎంపీటీసీ శ్రీను, సర్పంచ్‌ శేఖర్‌, ఇస్తారి, జాహీద్‌ హుస్సెన్‌, జావీద్‌, మల్లేష్‌, భీమన్న, రమేష్‌, వెంకటేష్‌, వైకుంఠం, శ్రీకాంత్‌, దసురుబాయి, కార్యదర్శి తుకారాం, నారాయణ, రాజేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T04:08:59+05:30 IST