సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2022-05-18T05:34:21+05:30 IST

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
కందుకూరు: లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్న బొక్క జంగారెడ్డి, సురేందర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి

ఆమనగల్లు/కందుకూరు, మే 17: ఆమనగల్లు, కడ్తాల్‌, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు చెందిన పలువురు లబ్ధ్దిదారులకు సీఎం సహాయనిధి ద్వారా రూ.2.50లక్షలు మంజూరు అయ్యాయి. ఈ చెక్కులను ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ మంగళవారం నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్పిడి గోపాల్‌, నాయకులు మోత్యనాయక్‌, బాలకృష్ణ, డాక్టర్‌ రాంరెడ్డి, రాజు, బాల్‌రాజు, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కందుకూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రూ.3లక్షలా 43వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి మండల పరిషత్‌ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సర్పంచులు ఎం.శ్రీదేవిశేఖర్‌రెడ్డి, ఆర్‌.సోమ్లానాయక్‌, మహేష్‌, నాయకులు ఎస్‌.సురేందర్‌రెడ్డి, మస్కు బాబు, జయమ్మ, టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గం యూత్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కార్తీక్‌, దీక్షత్‌రెడ్డి, కె.విఘ్నేశ్వర్‌రెడ్డి, ఎలుక మేఘనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:34:21+05:30 IST