అప్పన్న సన్నిధిలో దర్శకుడు అనిల్ రావిపూడి
ABN , First Publish Date - 2022-08-11T06:29:25+05:30 IST
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి బుధవారం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రముఖ హీరో బాలకృష్ణ కథా నాయకుడిగా త్వరలో నిర్మించనున్న సినిమా స్ర్కిప్ట్తో ప్రత్యేక పూజలు చేయించారు.
సింహాచలం, ఆగస్టు 10: ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి బుధవారం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రముఖ హీరో బాలకృష్ణ కథా నాయకుడిగా త్వరలో నిర్మించనున్న సినిమా స్ర్కిప్ట్తో ప్రత్యేక పూజలు చేయించారు. తొలుత కప్పస్తంభ ఆలింగనం చేసుకుని బేడా మండప ప్రదక్షిణలు చేసిన ఆయన అంతరాలయంలో స్వామి పాదాల వద్ద సినిమా స్ర్కిప్ట్ ఉంచగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదాదేవి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం ఈయగా ఏఈవో ఎన్.ఆనందకుమార్ స్వామివారి ప్రసాదం అందజేశారు. దర్శకుడి వెంట 98వ వార్డు కార్పొరేటర్ పిసిని నరసింహం, టీడీపీ నేతలు పంచదార్ల శ్రీనివాస్, గుసిడి అవినాష్బాబు, బంతి శ్రీనివాసరావు, తాళ్లపూడి నాగరాజు తదితరులున్నారు.