అర్హులకు నేరుగా లబ్ధి

ABN , First Publish Date - 2022-05-18T06:05:53+05:30 IST

అవినితీ లేకుండా నేరుగా అర్హులకు లబ్ధి చేకూరుస్తున్న ఘనత సీఎం జగన్మోహనరెడ్డిదే అని తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి అన్నారు.

అర్హులకు నేరుగా లబ్ధి
మారేపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రక్షణనిధి

అది ఓర్వలేకే ప్రతిపక్షాల అసత్య ప్రచారం 

 ఎమ్మెల్యే రక్షణనిధి

ఎ.కొండూరు, మే 17 : అవినితీ లేకుండా నేరుగా అర్హులకు  లబ్ధి చేకూరుస్తున్న  ఘనత సీఎం జగన్మోహనరెడ్డిదే అని తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి అన్నారు. మారేపల్లి గ్రామంలో మంగళవారం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కోడూరు, మారేపల్లి లాంటి చిన్న గ్రామాల్లో 4013 మంది లబ్ధిదారులకు రూ.23.63 కోట్ల లబ్ధి అందజేశామాన్నారు. మరో రూ.20 లక్షలతో ప్రభుత్వ భవనాలు నిర్మాణాలు జరుగుతునట్టు తెలిపారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందితే తమ రాజకీయ భవిషత్తు ఉండదని ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో నేతలు, అధికారులు ఊపిరిపిల్చుకొన్నారు. ఏఎంసీ చైర్మన్‌ నాగనర్సిరెడ్డి, ఎంపీపీ నాగలక్ష్మి, జడ్సీటీసీ సభ్యుడు గన్యా, ఎంపీడీవో నాగేశ్వరరావు, తహసీల్దార్‌ వీరాంజనేయ ప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T06:05:53+05:30 IST