బైక్‌నుంచి పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-11-30T05:36:45+05:30 IST

బైక్‌నుంచి పడి యువకుడి మృతి

బైక్‌నుంచి పడి యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మోతీలాల్‌

కులకచర్ల: మండలంలోని కుసుసముద్రం గ్రామానికి చెందిన మోతీలాల్‌ అనే వ్యక్తి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామ పరిధిలోని చెరువు ముందటి తండాకు చెందిన మోతీలాల్‌(29), శ్రీనివాస్‌ వెళుతున్న బైక్‌ అదుపుతప్పి బోల్తాకొట్టింది. దీంతో మోతీలాల్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని ఏఎంసీ మాజీ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, జేఏసీ కన్వీనర్‌ గంగానాయక్‌ పరిశీలించారు. యువకుడు మృతితో చెరువుముందటి తండాలో విషాదం నెలకొంది. 

Updated Date - 2020-11-30T05:36:45+05:30 IST