రాష్ట్రంలో నియంత పాలన

ABN , First Publish Date - 2021-01-27T06:20:19+05:30 IST

రాష్ట్రంలో సీఎం జగన్‌ నియంత పాలన సాగిస్తున్నారని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు.

రాష్ట్రంలో నియంత పాలన
పెందుర్తిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బండారు

మాజీ ఎమ్మెల్యే బండారు ధ్వజం

పెందుర్తి, జనవరి 26: రాష్ట్రంలో సీఎం జగన్‌ నియంత పాలన సాగిస్తున్నారని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. జగన్‌ విధ్వంసకర పాలనను రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటిస్తూ మంగళవారం నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పెందుర్తిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అరాచకం వల్ల న్యాయస్థానానికి వెళ్లి ప్రజాస్వామ్య హక్కులు సాధించుకోవలసిన దారుణ పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. న్యాయస్థానాలు ఎన్ని మొట్టికాయలు వేస్తున్న జగన్‌కు  సిగ్గులేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బండారు అప్పలనాయుడు, దాట్ల మధు, బుచ్చిరాజు, కరక దేవుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T06:20:19+05:30 IST