పరిపాలన రాజధానిగా కర్నూలుగా ప్రకటించాలి: కేఈ

ABN , First Publish Date - 2020-08-02T18:17:32+05:30 IST

రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు చేయాల్సి వస్తే కర్నూలును పరిపాలన రాజధానిగా..

పరిపాలన రాజధానిగా కర్నూలుగా ప్రకటించాలి: కేఈ

డోన్(కర్నూల్): రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు చేయాల్సి వస్తే కర్నూలును పరిపాలన రాజధానిగా ప్రకటించాలని డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్ అన్నారు. శనివారం డోన్‌లో ఆయన మాట్లాడారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. అయితే గతంలో కర్నూలు జిల్లా ప్రజలు రాజధానిని కోల్పోయి ఎంతో నష్టపోయారన్నారు. విశాఖ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని, అలాంటి చోట పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం తగదన్నారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులోనే పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-02T18:17:32+05:30 IST