యువకుడి మృతదేహంతో ధర్నా

ABN , First Publish Date - 2021-04-13T06:32:11+05:30 IST

యువకుడి కుటుంబానికి న్యాయం చేయా లని కోరుతూ మృతదేహంతో యువతి ఇంటి ఎదుట ధర్నా చేశారు.

యువకుడి మృతదేహంతో ధర్నా

 ఇరువర్గాల మధ్య రాజీ

అనంతగిరి, ఏప్రిల్‌ 12: యువకుడి కుటుంబానికి న్యాయం చేయా లని కోరుతూ  మృతదేహంతో యువతి ఇంటి ఎదుట ధర్నా చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గోండ్రియాల  గ్రామానికి చెందిన లింగం నరేష్‌(21) అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ఎనిమిది నెలలుగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరివీ  వేర్వేరు కులం కావడంతో వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. గత నెల 23వ తేదీన యువతి పుట్టినరోజు సందర్భంగా వాట్సాప్‌ ద్వారా నరేష్‌ శుభా కాంక్షలు తెలిపాడు.  ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలి యడంతో  నరేష్‌పై దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిననరేష్‌ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో  న్యాయం చేయాలని ఽనరేష్‌ మృతదేహంతో యువతి ఇంటి ఎదుట ధర్నా చేశారు.  రాత్రికి ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది.. కోదాడ రూరల్‌ సీఐ శివరామిరెడ్డి, అనంతగిరి ఎస్‌ఐ సత్యనారాయణగౌడ్‌ బందోబస్తును పర్యవేక్షించారు. 


Updated Date - 2021-04-13T06:32:11+05:30 IST