టీటీడీ ఆస్తుల విక్రయాన్ని నిరసిస్తూ ధర్నా
ABN , First Publish Date - 2020-05-26T08:45:45+05:30 IST
దేవాలయ ఆస్తుల విక్రయాన్ని నిరసిస్తూ టీటీడీ ఆస్తుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం బందరులో ధర్నా నిర్వహించారు.
మచిలీపట్నం టౌన్ : దేవాలయ ఆస్తుల విక్రయాన్ని నిరసిస్తూ టీటీడీ ఆస్తుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం బందరులో ధర్నా నిర్వహించారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు సోడిశెట్టి బాలాజీ, కూనపరెడ్డి శ్రీనివాసరావు, పంతం గజేంద్ర డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మోట మర్రి బాబా ప్రసాద్, మాజీ కౌన్సిలర్ కొట్టె వెంకట్రావు, పి.వి. ఫణికుమార్ పాల్గొన్నారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపం మేనేజర్ గిరిబాబుకు వినతిపత్రం సమర్పించారు.