జీ+3 గృహాలు కేటాయించాలని ధర్నా
ABN , First Publish Date - 2020-07-13T11:20:13+05:30 IST
మల్లాయపాలెంలో పూర్తి అయిన జీ+3 గృహాలను లబ్ధిదారులకు కేటాయించాలని ఆదివారం..
గుడివాడ టౌన్ : మల్లాయపాలెంలో పూర్తి అయిన జీ+3 గృహాలను లబ్ధిదారులకు కేటాయించాలని ఆదివారం సీపీఎం ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు. మొదటి విడత జీ+3 పూర్తయి ఏడాదైనా రహదారులు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించకపోవడం దారుణమని సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి అన్నారు. టి.లక్ష్మణరావు, వీరమ్మ పాల్గొన్నారు.