శ్రమదానం చేసి సచివాలయ నిర్మాణం పూర్తిచేస్తాం

ABN , First Publish Date - 2022-06-08T20:13:22+05:30 IST

తోట్లవల్లూరు మండలం బొడ్డపాడులో టీడీపీ నాయకులు ధర్నా చేశారు. ఏడాదిన్నర కాలమయినా గ్రామంలో సచివాలయ భవన నిర్మాణం పూర్తి

శ్రమదానం చేసి సచివాలయ నిర్మాణం పూర్తిచేస్తాం

కృష్ణా జిల్లా: తోట్లవల్లూరు మండలం బొడ్డపాడులో టీడీపీ నాయకులు ధర్నా చేశారు. ఏడాదిన్నర కాలమయినా గ్రామంలో సచివాలయ భవన నిర్మాణం పూర్తి కాలేదు. ఇందుకు నిరసనగా టీడీపీ మద్దతు సర్పంచ్ శివ శంకర్  ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, టీడీపీ పామర్రు ఇన్‌చార్జ్ వర్ల కుమార్ రాజా,  ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు ధర్నాలో పాల్గొన్నారు. భవన నిర్మాణం చివరి దశకు చేరుకున్నా.. కక్షపూరితంగానే పనులు పూర్తి చేయడం లేదని సర్పంచ్ శివ శంకర్ ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకుంటే శ్రమదానంతో భవన నిర్మాణం పూర్తి చేస్తామని వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.  

Updated Date - 2022-06-08T20:13:22+05:30 IST