జీతాలు ఇవ్వడం లేదని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2021-02-27T06:34:20+05:30 IST

మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం కాంట్రాక్ట్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన

జీతాలు ఇవ్వడం లేదని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరసన

గచ్చిబౌలి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం కాంట్రాక్ట్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. స్టేడియంలో పనిచేసే హౌస్‌కీపింగ్‌, గార్డెనింగ్‌ కార్మికులు, ఎలక్ర్టీషియన్‌, ప్లబింగ్‌, టెక్నికల్‌ కార్మికులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. సంవత్సరానికి ఒకసారి కాంట్రాక్టర్లు మారుతున్నారు. మారిన ప్రతిసారీ దాదాపు మూడునాలుగు నెలలు జీతాలు ఇవ్వకుండానే వెళ్లిపోవడంతో తాము నష్టపోతున్నామని కార్మికులు వాపోయారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా లేబర్‌ ఆఫీసర్స్‌కు, గచ్చిబౌలి పోలీసులకు, స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. జీతాలు చెల్లించే వరకు విధులకు హాజరు కాబోమని కార్మికులు స్పష్టం చేశారు.


Updated Date - 2021-02-27T06:34:20+05:30 IST