ధారావిలో మళ్లీ భయపెడుతున్న మహమ్మారి.. కొత్తగా 147 కేసులు

ABN , First Publish Date - 2022-01-09T00:04:52+05:30 IST

ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ..

ధారావిలో మళ్లీ భయపెడుతున్న మహమ్మారి.. కొత్తగా 147 కేసులు

ముంబై: ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్ మళ్లీ బుసలు కొడుతోంది. దీంతో చాలా రాష్ట్రాలు ఆంక్షల పరిధిలోకి వెళ్లిపోయాయి. కరోనా తొలినాళ్లలో ఉక్కిరిబిక్కిరి అయిన ముంబైలోని ధారావిలో ఇప్పుడు మళ్లీ ఆందోళన మొదలైంది.


ఇక్కడ కూడా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా, గత 24 గంటల్లో 147 కేసులు వెలుగుచూశాయి. వీటితో కలుపుకుని ఇక్కడ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 729కి పెరిగింది. ముంబైలోని సీబీఐ కార్యాలయలో 68 మంది సిబ్బందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

Updated Date - 2022-01-09T00:04:52+05:30 IST