సీజ్‌ చేసిన వాహనాల విడుదలకు మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2020-05-24T08:45:29+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో సీజ్‌ చేసిన వాహనాలను విడిచిపెట్టేందుకు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ శనివారం మార్గ దర్శకాలు జారీ చేశారు.

సీజ్‌ చేసిన వాహనాల విడుదలకు మార్గదర్శకాలు

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి : లాక్‌డౌన్‌ సమయంలో సీజ్‌ చేసిన వాహనాలను విడిచిపెట్టేందుకు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌  శనివారం మార్గ దర్శకాలు జారీ చేశారు. మార్చి 23న లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 5,362 వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. ఈ వాహనా లను ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోని సినిమా థియేటర్లు, మైదానాలు, ఖాళీ ప్రదేశాల్లో ఉంచారు.  ఈ వాహనాలను సంబంధిత యజమానులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. దీనికోసం వాహనాల ధ్రువపత్రాలను సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో సమర్పించా ల్సి ఉంటుంది.  వాటిని పరిశీలించి పోలీసులు వాహనా లను విడిచిపెడతారు. కాగా, లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు జిల్లా వ్యాప్తంగా 11,323 మందిపై 9,152 కేసులు నమోదు చేశారు.  

Updated Date - 2020-05-24T08:45:29+05:30 IST