రూ.50కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-06-12T05:17:39+05:30 IST
ఎల్లారెడ్డి నియోజక వర్గంలో రూ.50కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేంధర్ రెడ్డి అన్నారు. మండలంలో రూ.5కోట్లతో సీసీరోడ్లు, రూ.6కోట్ల50లక్షలతో సజ్జన్ పల్లి-పొల్కంపేట బీటీరోడ్డు, బ్రీడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
లింగంపేట, జూన్ 11: ఎల్లారెడ్డి నియోజక వర్గంలో రూ.50కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేంధర్ రెడ్డి అన్నారు. మండలంలో రూ.5కోట్లతో సీసీరోడ్లు, రూ.6కోట్ల50లక్షలతో సజ్జన్ పల్లి-పొల్కంపేట బీటీరోడ్డు, బ్రీడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. శుక్రవారం మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి, సజ్జన్పల్లి, ఎక్కపల్లి, పర్మల్ల, శెట్పల్లి, అయ్యపల్లి, మెంగారం, బోనాల్, కొర్పోల్, బాణాపూర్ గ్రామాలలో కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. నూతన రేషన్ కార్డులను అందజేస్తామని, త్వరలోనే అర్హులైన వారందరికీ పెన్షన్లు అందిస్తామని, డబుల్ బెడ్రూం ఇళ్లు అందిస్తానని ఆయన తెలిపారు. కోమట్పల్లి గ్రామంలో రూ.15లక్షలతో సీసీరోడ్డు పనులు ప్రారంభించా రు. అనంతరం కోమట్పల్లిలోని చారిత్రక ఆలయం ఆదిపరాశక్తి అల్లూరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐలాపూర్లో ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు పోకల ఆశయ్య, బెస్త జలంధర్ల కుటుంబాలను ఆయన పరామర్షిం చారు. కార్యక్రమంలో ఎంపీపీ గరీబున్నీసా, జడ్పీటీసీ శ్రీలత, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవెందర్రెడ్డి, సర్పంచ్లు అనిల్రెడ్డి, పద్మ, నర్సమ్మ, లక్ష్మీనారాయణ, రాజయ్య, రవీంధర్, ఎంపీటీసీలు రూప్సింగ్, కళ్యాణి, మండలపార్టీ అధ్యక్షుడు రమేష్, నాయకులు ఉన్నారు.