అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2021-07-25T06:01:35+05:30 IST

జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ పమేలాసత్పథి సూచించారు. చౌటుప్పల్‌ మండలం పంతంగి గ్రామాన్ని శనివారం సందర్శించారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
పల్లెప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

చౌటుప్పల్‌ రూరల్‌, జూలై 24: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ పమేలాసత్పథి సూచించారు. చౌటుప్పల్‌ మండలం పంతంగి గ్రామాన్ని శనివారం సందర్శించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను తనిఖీ చేశారు. పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి, మొక్కలు నాటారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. వైకుంఠధామాన్ని సందర్శించి, కంపోస్టు షెడ్డు, సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నర్సరీని పరిశీలించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న ఆన్‌లైన్‌ పాఠాల బోధన తీరును పరిశీలించారు. ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. పాఠశాలలో కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్‌కుమార్‌, ప్రత్యేకాధికారి శ్రీలక్ష్మీ, డీఎల్‌పీవో సాధన, ఎంపీడీవో రాఖే్‌షరావు, సర్పంచ్‌ బాతరాజు సత్యం, ఉపసర్పంచ్‌ లింగస్వామి, వార్డు సభ్యులు అంతటి వేణు, పల్సం నాగరాజు, తూర్పింటి రవి, కడగంచి లింగస్వామి, బర్మ లింగస్వామి, సింగిల్‌విండో డైరెక్టర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T06:01:35+05:30 IST