సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాల అభివృద్ధి
ABN , First Publish Date - 2021-06-24T05:42:46+05:30 IST
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ము ఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతున్నా యని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
- రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
పాలకుర్తి, జూన్ 23: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ము ఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతున్నా యని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవా రం మండలంలోని ఈసాలతక్కళ్లపల్లిలో రోడ్డుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకే తాము పాలన సాగిస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు క లగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రజల అవసరా ల మేరకే ఈసాలతక్కళ్లపల్లి నుంచి పుట్నూరు వరకు రోడ్డు నిర్మా ణం చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎం పీపీ వ్యాళ్ల అనసూయరాంరెడ్డి, వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, సింగిల్ విండో చైర్మన్ మామిడాల ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మగాని తిరుపతిగౌడ్, నాయకులు వెంకటేష్, మాదాసు అరవింద్ పాల్గొన్నారు.