బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి
ABN , First Publish Date - 2022-06-27T05:07:14+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
కోయిలకొండ, జూన్ 26 : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆదివారం మండ లంలోని గార్లపహాడ్, మల్కాపూర్, కేశవాపూర్, కోయిలకొండ, అంకిళ్ల గ్రామాల్లో పార్టీ జెండా కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. బీజేపీతోనే సంక్షేమం సాధ్యమవుతందన్నారు. కేసీఆర్ హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసగించారన్నారు. ప్రజలు మేల్కొని బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రతంగ్పాండురెడ్డి, స్థానిక నాయకులు చెన్నయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.