అభివృద్ధిలో పథంలో కూకట్పల్లి
ABN , First Publish Date - 2022-08-09T05:39:41+05:30 IST
కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధి ప థంలో పయనిస్తోందని ఎమ్మె ల్యే మాధవరం కృష్ణారావు అ న్నారు.
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్పల్లి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధి ప థంలో పయనిస్తోందని ఎమ్మె ల్యే మాధవరం కృష్ణారావు అ న్నారు. మూసాపేట డివిజన్లోని పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. వడ్డేరబస్తీల్లో రూ.70లక్షలతో సీసీ రోడ్ల పనులకు, పీఆర్నగర్లో రూ.17లక్షలతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఓపెన్ జిమ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్ర జలు వారివారి కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆయన కోరారు. ఎనిమిదేళ్లలో రూ.వేల కోట్లతో కూకట్పల్లి రూపురేఖలను మార్చే అభివృద్ధి చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మ హేందర్, జీహెచ్ఎంసీ డీఈ శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ శ్రావణ్కుమార్, అంబటి శ్రీనివాస్ ఉన్నారు.
కేపీహెచ్బీకాలనీ, (ఆంధ్రజ్యోతి): ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ష టిల్ కోర్టు ప్రారంభించి ఆట ఆడారు.