క్రీడలతో స్నేహబంధాలు పెంపొందుతాయి

ABN , First Publish Date - 2022-01-25T05:59:49+05:30 IST

క్రీడలతో స్నేహబంధాలు పెంపొందుతాయని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మహబూబ్‌ జాని అన్నారు. సాలార్జింగ్‌పేటలో గ్రామస్థాయి కబడ్డీ పోటీలను ఆయన సోమవారం ప్రారంభించారు.

క్రీడలతో స్నేహబంధాలు పెంపొందుతాయి
కబడ్డీ పోటీలను ప్రారంభిస్తున్న మహబూబ్‌ జాని

కోదాడటౌన్‌, జనవరి 24 : క్రీడలతో స్నేహబంధాలు పెంపొందుతాయని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మహబూబ్‌ జాని అన్నారు. సాలార్జింగ్‌పేటలో గ్రామస్థాయి కబడ్డీ పోటీలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ పూర్వం నుంచి కబడ్డీ క్రీడకు చాలా ప్రాముఖ్యం ఉందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌కె మధార్‌, బాగ్ధాద్‌, జాని, వీరస్వామి, రెహమాన్‌, బషీర్‌, నజీర్‌, దేవయ్య, గోవిందు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-25T05:59:49+05:30 IST