అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

ABN , First Publish Date - 2020-11-25T04:53:08+05:30 IST

పిడుగురాళ్ల పట్టణంలో శ్రీనివాసకాలనీ సమీపంలో మంగళవారం ఓ మైనర్‌ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

అనుమానాస్పద స్థితిలో  బాలిక మృతి

పిడుగురాళ్ల, నవంబరు24: పిడుగురాళ్ల పట్టణంలో శ్రీనివాసకాలనీ సమీపంలో మంగళవారం ఓ మైనర్‌ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీనివాసకాలనీ సమీపంలో ఓ వీధిలో నివశిస్తున్న షేక్‌ హిమాంసా కుమార్తె మాబ్‌బీ మంగళవారం మృతిచెందింది. అంత్యక్రియలకు శ్మశానానికి తరలించారు. చివరి నిమిషంలో మృతదేహాన్ని పరిశీలించిన బంధువు బాలిక మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని సందర్శించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-11-25T04:53:08+05:30 IST