చిల్వర్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
ABN , First Publish Date - 2021-12-05T04:33:13+05:30 IST
మండలంలోని చిల్వర్ గ్రామ సమీపంలోని 161వ జాతీయ రహదారి పక్కన మూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను శుక్రవారం నాటి రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.
రూ.2.50 లక్షల విలువగల ఆయిల్, కాపర్ చోరీ
అల్లాదుర్గం, డిసెంబరు 4: మండలంలోని చిల్వర్ గ్రామ సమీపంలోని 161వ జాతీయ రహదారి పక్కన మూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను శుక్రవారం నాటి రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దాదాపు రూ. 2.50 లక్షల విలువైన ఆయిల్, కాపర్ను అపహరించుకుపోయినట్లు ట్రాన్స్కో ఏఈ అప్పలనాయుడు శనివారం తెలిపారు. గ్రామ సమీపంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ ట్రాన్స్ఫార్మర్లకు అల్లాదుర్గంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి సరఫరా చేస్తున్న విద్యుత్ తీగలను తొలగించి చోరీకి పాల్పడినట్టు వివరించారు. ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఏఈ తెలిపారు.