2 నెలల క్రితం ప్రేమ పెళ్లి.. రైలు కింద పడి భర్త బలవన్మరణం.. జేబులో దొరికిన లేఖలో ఓ ఫోన్‌ నెంబర్‌తో పాటు షాకింగ్ నిజాలు..!

ABN , First Publish Date - 2022-06-01T08:34:06+05:30 IST

రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా వ్యక్తి. అతను ఎవరో ఎవరికీ తెలియదు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులకు.. మృతదేహం జేబులో ఒక లేఖ దొరికింది. లేఖ ద్వారా పోలీసులు కేసును ఛేదించారు.రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది...

2 నెలల క్రితం ప్రేమ పెళ్లి.. రైలు కింద పడి భర్త బలవన్మరణం.. జేబులో దొరికిన లేఖలో ఓ ఫోన్‌ నెంబర్‌తో పాటు షాకింగ్ నిజాలు..!

రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా వ్యక్తి. అతను ఎవరో ఎవరికీ తెలియదు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులకు.. మృతదేహం జేబులో ఒక లేఖ దొరికింది. లేఖ ద్వారా పోలీసులు కేసును ఛేదించారు.రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. 


జైపూర్‌ పరిధిలోని నైనవా బూందీ ప్రాంతంలో సీతారామ్ గుర్జర్ (30) నివశిస్తున్నాడు. అతను రెండు నెలల క్రితం సోనా హిందోళీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సీతారామ్ ప్రేమ వివాహం చేసుకోవడం అతని తల్లిదండ్రులకు ఇష్టంలేదు. వారు ఎంత వద్దిన చెప్పినా అతను వినలేదు.


అయితే పెళ్లయిన కొన్ని రోజులకే సోనా అతడిని మోసం చేసింది. అతను ఫ్యాక్టరీలో పనికి వెళ్లగానే ఇంట్లోని నగలు, డబ్బు తీసుకొని పరారైంది. ఈ విషయం తెలిసిన సీతారాం తట్టుకోలేకపోయాడు. తన సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతన్ని ఓదార్చిన సోదరుడు ఇంటికి వచ్చేయమని చెప్పాడు. ‘‘ఇప్పుడు వచ్చి ఏం చెప్తాను? ఒక పది రోజుల తర్వాత ఊరికి వచ్చి అక్కడే ఉండిపోతాను’’ అని సీతారాం చెప్పాడు. ఆ తర్వాత సిటీలోనే ఉండే మేనమామ ఇంటికి వెళ్లాడు. 


రెండ్రోజుల తర్వాత అక్కడ కూడా ఉండలేనని, ఫ్యాక్టరీకి వెళ్లిపోతానని చెప్పాడు. ఇంటి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి రైల్వే ట్రాక్ చేరుకొని రైలు కింద పడ్డాడు. అతని జేబులో దొరికిన లేఖలో మేనల్లుడి ఫోన్ నెంబర్ ఉంది. అతనికే ఫోన్ చేసి ముందుగా విషయం చెప్పాలని సీతారాం కోరాడు. తనను భార్య మోసం చేసిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. తన కుటుంబానికి దీంతో సంబంధం లేదన్నాడు. తన ఖాతాలో ఉన్న డబ్బు, ఫ్యాక్టరీలో లభించే పీఎఫ్ అంతా తల్లిదండ్రులను తీసుకోవాలని కోరాడు. ఈ క్రమంలో సీతారాం సోదరుడు బంశీలాల్.. పోలీసులను ఆశ్రయించాడు. ఇంటి నుంచి నగలు, డబ్బు, మొబైల్ ఎత్తుకెళ్లి.. సీతారాంను మోసం చేసిన సోనాపై కేసు పెట్టాడు. సీతారాం వద్ద నుంచి డబ్బులు దోచుకున్న ఆమె.. మొదటి భర్త దగ్గరకు వెళ్లిపోయిందని తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-06-01T08:34:06+05:30 IST