ఎస్కార్ట్‌ విధుల్లో నిర్లక్ష్యం చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు

ABN , First Publish Date - 2022-07-02T05:20:39+05:30 IST

ఎస్కార్ట్‌ విధుల్లో నిర్లక్ష్యం చేసిన పోలీసులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు సీపీ ఎన్‌.శ్వేత తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎస్కార్ట్‌ విధుల్లో నిర్లక్ష్యం చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు


హుస్నాబాద్‌, జూలై 1 : ఎస్కార్ట్‌ విధుల్లో నిర్లక్ష్యం చేసిన పోలీసులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు సీపీ ఎన్‌.శ్వేత తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. హుస్నాబాద్‌ ఏసీపీతో పాటు ఇతర పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించి దాడి చేసిన కేసులో రిమాండ్‌కు పంపించిన నిందితులను గురువారం స్థానిక ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచే క్రమంలో నిర్లక్ష్యం చేసిన పోలీసులపై ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే గురువారం కరీంనగర్‌ జైలు నుంచి గౌరవెల్లి రిజర్వాయర్‌ భూ నిర్వాసితుల చేతులకు బేడిలు, గొలుసులతో తీసుకవచ్చి స్థానిక కోర్టులో హాజరుపరిచిన సంఘటనపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.


Updated Date - 2022-07-02T05:20:39+05:30 IST