గిరిజనుల ఇళ్లు కూల్చేయడం అన్యాయం

ABN , First Publish Date - 2022-05-28T06:42:34+05:30 IST

గిరిజనులు తమ పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చేయడం అన్యాయమని స్థానిక జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం అన్నారు.

గిరిజనుల ఇళ్లు కూల్చేయడం అన్యాయం
బాధిత రిలే దీక్షల్లో పాల్గొన్న జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం


బాధితుల దీక్షల్లో పాల్గొన్న జడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగం 

హుకుంపేట, మే 27: గిరిజనులు తమ పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చేయడం అన్యాయమని స్థానిక జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం అన్నారు. బాధిత గిరిజనులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. గిరిజనులైన గోమంగి దొన్ను, తిరుపతిరావు తమ పట్టా భూమిలో రేకుల ఇళ్లను నిర్మించుకుంటే, అకారణంగా రెవెన్యూ అధికారులు కూల్చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సమస్యను స్థానిక రెవెన్యూ అధికారులు త్వరలోనే పరిష్కరించకుంటే పైస్థాయికి తీసుకువెళతామని మత్స్యలింగం హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. తమకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం చెల్లించాలని బాధిత గిరిజనులు డిమాండ్‌ చేశారు. బాధితులకు సూకూరు సర్పంచ్‌ సత్యవతి, ఎంపీటీసీ సభ్యుడు సింహాచలం మద్దతు పలికారు.

Updated Date - 2022-05-28T06:42:34+05:30 IST