108 అంబులెన్స్లో మహిళ ప్రసవం
ABN , First Publish Date - 2020-12-02T04:48:56+05:30 IST
108 అంబులెన్స్లో మహిళ ప్రసవం
- ఆరోగ్యంగా తల్లి, శిశువు
కందుకూరు: పురుటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణిని నగరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్లో మగశిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువుల ఆరోగ్యంగా ఉన్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా వున్నాయి. చత్తీ్షగడ్ రాష్ట్రానికి చెందిన భార్యా భర్తలు మంగ్లీ, దేవా కొన్ని సంవత్సరాల క్రితం రాచులూరు గేటు వద్ద ఉన్న ఫౌల్ర్టీ ఫామ్లో పనిచేస్తున్నారు. మంగళవారం మంగ్లీకి పురుటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. ఈఎంటీ రాజేష్, పైలెట్ యాదయ్య ఆమెను నగరానికి తరలిస్తుండగానే మార్గ మధ్యలో ప్రసవించింది. వారిద్దరినీ మండల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లీ, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.