Delhi లో గోదాము గోడ కూలి ఐదుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2022-07-15T21:27:09+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని అలిపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక గోదాము గోడ కూలి..

Delhi లో గోదాము గోడ కూలి ఐదుగురు దుర్మరణం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని అలిపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక గోదాము గోడ కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు, మరో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే ఐదు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.


కాగా, శిథిలాల కింద నుంచి 10 మందిని రక్షించామని, మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని అనుకుంటున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి కారణాలు వెంటనే తెలియలేదు.

Updated Date - 2022-07-15T21:27:09+05:30 IST