ఢిల్లీలో కొత్త కేసులు 89, ఈ ఏడాదిలోనే కనిష్టం

ABN , First Publish Date - 2021-06-21T23:22:55+05:30 IST

దేశ రాజధానిలో గత 24 గంటల్లో కొత్తగా 89 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువగా..

ఢిల్లీలో కొత్త కేసులు 89, ఈ ఏడాదిలోనే కనిష్టం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గత 24 గంటల్లో కొత్తగా 89 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి. పాజిటివిటీ రేటు 0.16 శాతానికి చేరింది. 100 కంటే తక్కువ కేసులు నమోదు కావడం ఒక విశేషమైతే, యాక్టివ్ కేసులు 2,000 కంటే దిగువకు చేరుకున్నాయి. సిటీలో గత ఇరవై నాలుగు గంటల్లో 173 మందికి పూర్తి స్వస్థత చేకూరగా, 11 మంది మృత్యవాత పడినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ బులిటెన్ పేర్కొంది.


తాజా గణాంకాల ప్రకారం, గత మార్చి 10న 1,900 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి అతి కనిష్టంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. పాజిటివిటీ రేటు కూడా కనిష్ట శాతానికి (0.16) చేరింది. రికవరీ రేటు శనివారంనాడు 98.12గా ఉంది. గత ఫిబ్రవరి 21న ఇదే రికవరీ రేటు ఉండటం విశేషం.

Updated Date - 2021-06-21T23:22:55+05:30 IST