ఢిల్లీలో ఘోర ప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం

ABN , First Publish Date - 2022-04-30T21:46:53+05:30 IST

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. జంగ్‌పురాలో దుకాణాల్లోకి డీటీసీ బస్సు దూసుకెళ్లడంతో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని, వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్ చెప్పారు. బస్సు సరాయ్ కాలే ఖాన్ ప్రాంతం నుంచి జంగ్‌పురా వైపు వెళుతోంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన దుకాణాలను బస్సు ఢీకొట్టిందని అధికారి తెలిపారు.

Updated Date - 2022-04-30T21:46:53+05:30 IST