28 నుంచి డిగ్రీ సెమెస్టర్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-09-25T10:55:07+05:30 IST
28 నుంచి డిగ్రీ సెమెస్టర్ పరీక్షలు
చీపురుపల్లి, సెప్టెంబరు 24 : డిగ్రీ ఆరో సెమెస్టర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి నిర్వహించనున్నట్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి.తాతారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఎస్సీ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ, బీఏ, బీకాం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకూ పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షలకు హాజరయ్యే వారు తప్పకుండా మాస్కు ధరించి, శానిటైజర్, వాటర్ బాటిల్ తీసుకురావాలన్నారు. కొవిడ్ పాజిటివ్ విద్యార్థులు ముందుగానే సమాచారం ఇస్తే... ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామన్నారు.