24న అప్పన్నకు మూడో విడత చందన సమర్పణ
ABN , First Publish Date - 2021-06-15T05:34:40+05:30 IST
సింహాద్రి అప్పన్న స్వామికి జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా ఈనెల 24న మూడో విడత చందన సమర్పణ జరపనున్నారు.
సింహాచలం, జూన్ 14: సింహాద్రి అప్పన్న స్వామికి జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా ఈనెల 24న మూడో విడత చందన సమర్పణ జరపనున్నారు. ఇందులో భాగంగా 16న గంధం ముక్కల కోత, 17న చందనం అరగదీత సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా అప్పన్న నిత్యకల్యాణాన్ని అర్చకులు ఘనంగా జరిపారు.