ఇన్స్టిట్యూట్ల పునఃప్రారంభంపై త్వరలో నిర్ణయం: సీఎం బొమ్మై
ABN , First Publish Date - 2022-02-10T22:38:55+05:30 IST
ఇన్స్టిట్యూట్ల పునఃప్రారంభంపై త్వరలో నిర్ణయం: సీఎం బొమ్మై
బెంగళూరు: హిజాబ్ వివాదం నేపథ్యంలో ఇన్స్టిట్యూట్ల పునఃప్రారంభంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై తెలిపారు. గురువారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి, హోంమంత్రితో సమావేశమైన తర్వాత రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక సీఎం బసవరాజ్ ఎస్ బొమ్మై పేర్కొన్నారు. హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటకలో మంగళవారం మూడు రోజుల పాటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని, విద్యార్థులు శాంతిభద్రతలను కాపాడాలని బొమ్మై కోరారు.