అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-17T05:57:42+05:30 IST
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తొగుట మండల చందాపూర్
సిద్దిపేటసిటీ, మే 16: అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తొగుట మండల చందాపూర్కు చెందిన పడాల ప్రశాంత్ (25) పొట్టకూటి కోసం 8నెలల క్రితం సిద్దిపేటకు తన భార్య తో కలిసి వచ్చాడు. ఓ ఫైనాన్స్లో అశోక్ లైలాండ్ వాహనం కొనుక్కుని జీవనం సాగిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించడంతో వాహన కిస్తీలు కట్టడం లేదు. ఇటీవలే తన భార్య డెలివరీ అయ్యి ఆసుపత్రిలో ఉంది. కిస్తీలు, ఆసుపత్రిలో డబ్బు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ పరుశురామ్గౌడ్ తెలిపారు.