ఏక కాలంలో రుణమాఫీ చేయాలి
ABN , First Publish Date - 2020-05-23T09:44:19+05:30 IST
ప్రభుత్వం ఏక కాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి రాఘవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.
కల్వకుర్తి అర్బన్, మే 22: ప్రభుత్వం ఏక కాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి రాఘవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. కల్వకుర్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతులకు రుణమాఫీ రైతుబంధు తక్షణమే అందించాలని ఆర్ఐ శశిధర్ రావుకు నాయకులు వినతి పత్రం అందజేశారు. నాయకులు వీరస్వామి, కృష్ణ గౌడ్, శేఖర్ రెడ్డి, నరేష్ గౌడ్, శ్రీశైలం, స్వామి గౌడ్, పరుశరాములు, రాజశేఖర్, శీను తదితరులు పాల్గొన్నారు.