‘నాడు-నేడు’ పనుల్లో నాణ్యత పాటించాలి
ABN , First Publish Date - 2020-06-04T10:47:35+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పథకం కింది చేస్తున్న పనుల్లో నాణ్యత పాటించాలని సర్వశిక్ష అభియాన్ డీఈ దామోదర నాయుడు ..
కేవీబీపురం, జూన్ 3: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పథకం కింది చేస్తున్న పనుల్లో నాణ్యత పాటించాలని సర్వశిక్ష అభియాన్ డీఈ దామోదర నాయుడు సూచించారు. మండలంలో రూ.6కోట్లతో జరుగుతున్న నాడు-నేడు పనులను బుధవారం పరిశీలించారు. ఈ పనులన్నీ జూన్ నెలాఖరుకంతా పూర్తి చేయాలన్నారు. సర్వశిక్ష అభియాన్ ప్లానింగ్ డీఈ దామోదర రెడ్డి, ఏఈ వెంకటరమణ, ఎంఈవో తదితరులు పాల్గొన్నారు.