డీడీ న్యూస్‌ రీడర్‌ పార్వతీ ప్రసాద్‌ మృతి

ABN , First Publish Date - 2020-04-13T08:26:05+05:30 IST

ఆకాశవాణి, దూరదర్శన్‌ న్యూస్‌ రీడర్‌ , రచయిత్రి పింగళి పార్వతీ ప్రసాద్‌(70) ఆదివారం మృతి చెందారు. కొద్ది రోజులుగా ...

డీడీ న్యూస్‌ రీడర్‌ పార్వతీ ప్రసాద్‌ మృతి

ఆబిడ్స్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఆకాశవాణి, దూరదర్శన్‌ న్యూస్‌ రీడర్‌ , రచయిత్రి పింగళి పార్వతీ ప్రసాద్‌(70) ఆదివారం మృతి చెందారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో ఉన్న ఆమె హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె మృతి ఎన్నో రంగాలకు తీరని లోటని తెలంగాణ సారస్వత పరిషత్‌ కార్యదర్శి, న్యూస్‌రీడర్‌ డాక ్టర్‌ జుర్రు చెన్నయ్య అన్నారు. 1980వ దశకం నుండి ఆకాశవాణి, దూరదర్శన్‌లో పనిచేసిన పార్వతీ ప్రసాద్‌.. ఆకాశవాణిలో కార్యక్రమ నిర్మాణంతో ప్రారంభించి.. వార్తా విభాగంలో సీనియర్‌ న్యూస్‌ రీడర్‌గా దాదాపు 35 ఏళ్ల పాటు సేవలందించారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-13T08:26:05+05:30 IST