తండ్రికి అంత్యక్రియలు చేసిన కుమార్తెలు

ABN , First Publish Date - 2021-08-30T14:00:01+05:30 IST

యూపీలోని వారణాసిలో చోటుచేసుకున్న ఒక అరుదైన ఘటన...

తండ్రికి అంత్యక్రియలు చేసిన కుమార్తెలు

వారణాసి: యూపీలోని వారణాసిలో చోటుచేసుకున్న ఒక అరుదైన ఘటన చర్చనీయాంశంగా మారింది. సామాజిక కట్టుబాట్లను ఎండగడుతూ ఇద్దరు కుమార్తెలు తమ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే చౌబె‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరియాసన్‌పూర్ గ్రామానికి చెందిన హరిచరణ్ పటేల్(80) మృతి చెందాడు. 


అతని కుమారుడు భాగీరథి పటేల్ ఈ విషయాన్ని తన అక్కాచెల్లెళ్లయిన ప్రేమ్ దేవీ, హీరామణిలకు తెలియజేశాడు. వేరే ప్రాంతంలో ఉంటున్నవారిద్దరూ వెంటనే పుట్టింటికి వచ్చారు. వారు తండ్రి కోరిక ప్రకారం అతని కళ్లను దానం చేశారు. అలాగే తండ్రి ఆధునిక భావాలను అర్థం చేసుకున్న కుమార్తెలు తండ్రి పాడెను భుజాలపైకి ఎత్తుకుని, ఇతర మహిళల సాయంతో స్మశాన వాటికకు చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2021-08-30T14:00:01+05:30 IST