దళితబంధు అమలు చేయాలి: కాంగ్రెస్
ABN , First Publish Date - 2022-01-28T05:14:51+05:30 IST
జిన్నారం మండలంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షల దళితబంధును అందజేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు గురువారం తహసీల్దార్ దశరథకు వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే రాష్ట్రంలోని అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి సహాయాన్ని అందజేయాలని కోరారు. కార్యక్రమంలో
జిన్నారం, జనవరి 27: జిన్నారం మండలంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షల దళితబంధును అందజేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు గురువారం తహసీల్దార్ దశరథకు వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే రాష్ట్రంలోని అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి సహాయాన్ని అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్గౌడ్, నియోజకవర్గ ఎస్సీ సెల్ కన్వీనర్ మహేష్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు కృష్ణ, పుట్టి భాస్కర్ పాల్గొన్నారు. కాగా జిన్నారం పరిధిలోని పెద్దమ్మగూడెం అంగన్వాడీ భవనానికి ఎంపీపీ రవీందర్గౌడ్ సొంత నిధులతో పెయింటింగ్ వేయించారు. స్థానిక నాయకులు ఎంపీపీని ఘనంగా సన్మానించారు.